కొడంగల్ లో 365 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు

కొడంగల్ లో 365 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు

కొడంగల్, వెలుగు: సీఎంఆర్ఎఫ్​పేదలకు వరమని కాంగ్రెస్​పార్టీ కొడంగల్​ఇన్​చార్జి ఎనుముల తిరుపతిరెడ్డి అన్నారు. మంగళవారం కడా ఆఫీస్​లో 365 మంది లబ్ధిదారులకు రూ.2 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్​చెక్కులు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. 

కొడంగల్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్​ క్లీన్ స్వీప్​ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కడా స్పెషల్ ఆఫీసర్​వెంకట్ రెడ్డి, జిల్లా లైబ్రరీ చైర్మన్​రాజేశ్​రెడ్డి, నాయకులు అంబయ్యగౌడ్​, శేఖర్, ముస్తాక్​తదితరులున్నారు.