
- కోల్ ఇండియా మీటింగ్ లో నిర్ణయం
- సింగరేణిలోనూ ఇవ్వాలని కార్మిక సంఘాల డిమాండ్
కోల్బెల్ట్, వెలుగు: దేశవ్యాప్తంగా బొగ్గు గనుల ఉద్యోగులతో పాటు ఆఫీసర్లకు ఇకముందు ఒకే రకమైన డ్రెస్కోడ్అమలు కానుంది. మంగళవారం న్యూఢిల్లీలో సీఐఎల్చైర్మన్పీఎల్ ప్రసాద్నేతృత్వంలో కోల్ ఇండియా అపెక్స్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా 2025-–26 ఆర్థిక సంవత్సరం కోల్ ఇండియా.. దాని అనుబంధ బొగ్గు పరిశ్రమలకు కేటాయించిన బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతతో పాటు పలు అంశాలపై చర్చించారు.
ఇందులో భాగంగా కొత్తగా అమల్లోకి తీసుకురానున్న డ్రెస్కోడ్కు సంస్థ ఏడాదికి రూ.12,500 చెల్లింపునకు ఆమోదం తెలిపిందని సీఐటీయూ వేజ్బోర్డు మెంబర్, సీఐటీయూ జనరల్సెక్రటరీ మందా నర్సింగరావు తెలిపారు. కోల్ ఇండియాలో జరిగిన ఒప్పందాన్ని వెంటనే సింగరేణిలోనూ అమలు చేయాలని డిమాండ్చేశారు. ఈ సమావేశంలో సీఐఎల్హెచ్ఆర్డీ డైరెక్టర్వినయ్కుమార్, యూనియన్ ప్రతినిధులు నాథు లాల్ పాండే, రామేంద్రకుమార్, రామానందన్, కె. లక్ష్మారెడ్డి హాజరయ్యారని తెలిపారు.