
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు సప్లై చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోల్ మూమెంట్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ బదావత్ వెంకన్న పేర్కొన్నారు. కొత్తగూడెం ఏరియాలో శుక్రవారం ఆయన పర్యటించారు. జీఎం ఆఫీస్లో పలు శాఖల ఆఫీసర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్దేశించిన విధంగా బొగ్గు ఉత్పత్తి చేయాలన్నారు. రోజు వారీ లక్ష్యాలను అధిగమిస్తూ ట్రాన్స్పోర్టు చేయాలన్నారు. బొగ్గు ఉత్పత్తి, ట్రాన్స్పోర్టు విషయంలో సేఫ్టీకి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
రైలు మార్గం ద్వారా జరుగుతున్న బొగ్గు వివరాలు, కాలుష్యం గురించి అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఏరియా జీఎం షాలెం రాజు, ఎస్వోటూజీఎం కోటిరెడ్డి, ఏరియా ఇంజినీర్ సూర్యనారాయణ రాజు, ప్రహ్లాద్, సోమశేఖర్, మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.