గోదావరిఖని, వెలుగు: సింగరేణి ఆర్జీ–1 ఏరియాలోని కోల్ హ్యాడ్లింగ్ ప్లాంట్ (సీహెచ్పీ) బొగ్గు రవాణాలో రికార్డు సృష్టించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 51.84 లక్షల టన్నుల బొగ్గును 1,322 రైల్వే రేక్ల ద్వారా రవాణా చేసి రికార్డు సృష్టించగా, తాజాగా 2025–-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే51.92 లక్షల టన్నుల బొగ్గును 1,323 రైల్వే రేక్ల ద్వారా రవాణా చేసి సరి కొత్త రికార్డును సృష్టించింది. మరో 10 రోజుల్లో 1,375 రైల్వే రేక్లను రవాణా చేసి 122 శాతం వృద్ధి రేటుతో ముందుకెళ్తామని అధికారులు తెలిపారు. సీహెచ్పీ నుంచి 2025–-26 ఆర్థిక సంవత్సరంలో కోల్ లింకేజీ ద్వారా 30.57 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయాలని సంస్థ టార్గెట్ విధించింది. కానీ, ఈ టార్గెట్ను 2025 నవంబర్ నాటికే సాధించింది.
