జాబ్స్ పేరుతో డబ్బులు వసూల్.. బోర్డు తిప్పేసిన కంపెనీ

జాబ్స్ పేరుతో డబ్బులు వసూల్.. బోర్డు తిప్పేసిన కంపెనీ

హైదరాబాద్ :గచ్చిబౌలిలో ఫన్ ల్యాబ్ టెక్నాలజీస్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. బీటెక్ ఫ్రెషర్స్ కు ఉద్యోగం ఇస్తామని, సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో చాలా మంది దగ్గర 20 నుంచి 50 వేల వరకు వసూలు చేశాడు కంపెనీ యజమాని. అపాయింట్ మెంట్ లెటర్స్ ఇచ్చి పరారయ్యాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు…పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు పోలీసులు.