
- కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, వెలుగు: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి122 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వీరబ్రహ్మచారి, డీఆర్డీవో పీడీ మధుసూదనరాజు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్నరసింహస్వామి, డీసీవో వెంకటేశ్వర్లు, డీవీహెచ్ వో డాక్టర్ కిరణ్ కుమార్, డీపీవో హరిప్రసాద్, డీడబ్ల్యూ వో ధనమ్మ తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండలో 113 దరఖాస్తులు
హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 113 అర్జీలు వచ్చాయి. జిల్లా ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్లు వైవీ.గణేశ్, మేన శ్రీను వాటిని స్వీకరించారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందించి, వెంటనే పరిష్కరించాలని సూచించారు.