
సీపీతో కలిసి నగర పర్యటన
నిజామాబాద్, వెలుగు: భారీ వర్షం హెచ్చరిక నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నగరంలోని డ్రైనేజీలను యుద్ధప్రతిపాదికన క్లీన్చేయాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన సీపీ సాయిచైతన్యతో కలిసి నగరంలోని ఖానాపూర్, నిజాంకాలనీ, తీన్కమాన్, ఐడీఓసీ మురుగు కాల్వలను పరిశీలించారు.
డ్రైనేజీలు క్లియర్గా లేకుంటే వర్షం నీరు వెళ్లడానికి దారిలేక కాలనీలు మునుగుతాయని, ఆ పరిస్థితి రాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని నగర పాలక కమిషనర్దిలీప్కుమార్ను ఆదేశించారు. ఎక్కడా సమస్య రాకుండా
చూడాలన్నారు.
డబుల్బెడ్రూం ఇండ్లను అర్హులకే కేటాయిస్తాం
నాగారంతో పాటు కలెక్టరేట్కు సమీపంలో నిర్మించిన 900 డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులకు కేటాయించే ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్తెలిపారు. ఇండ్లులేని పేద కుటుంబాలను గుర్తించి లిస్టును ఇన్చార్జ్మంత్రి సీతక్కకు పంపుతామన్నారు. ఇంటి స్థలం లేని పేదలు, సఫాయి కర్మచారీలు, వితంతులు, ఒంటరి మహిళలకు అలాట్మెంట్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇండ్ల సముదాయంలో రోడ్లు, డ్రైనేజీ, కరెంట్సౌలత్ కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కలెక్టర్వెంట హౌసింగ్జిల్లా మేనేజర్ పవన్కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్, ఆర్అండ్బీ డీఈ రంజిత్, ఏఈ నివర్తి తదితరులు ఉన్నారు.