ఇందిరమ్మ ఇండ్లకు ఫ్రీగా ఇసుక : ​జితేశ్​ వీ పాటిల్​​

ఇందిరమ్మ ఇండ్లకు ఫ్రీగా ఇసుక :  ​జితేశ్​ వీ పాటిల్​​
  • కలెక్టర్ ​జితేశ్​ వీ పాటిల్​​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గ్రౌండింగ్​ పూర్తి అయిన ఇందిరమ్మ ఇండ్లకు ఫ్రీగా ఇసుక సప్లై చేయనున్నట్టు కలెక్టర్​ జితేశ్ ​వీ పాటిల్ తెలిపారు. పలు శాఖల ఆఫీసర్లతో గురువారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్​లో ఆయన మాట్లాడారు. గ్రౌండింగ్​ పూర్తి అయిన ఇండ్ల నిర్మాణాలకు ఇసుక ఎన్ని ట్రక్కులు అవసరముందో ఎంపీడీవోలు తహసీల్దార్లకు నివేదికలు ఇవ్వాలన్నారు. ఇసుక రవాణాకు సంబంధించి రిజిస్టర్​లో వివరాలు నమోదు చేయాలని చెప్పారు. బడిబాటను ప్రతీ గ్రామంలో నిర్వహించాలన్నారు.

 జిల్లా వ్యాప్తంగా ఏబీసీడీ డ్రైవ్​ నిర్వహించాలని చెప్పారు. అజోల్లా పెంపకం, బయోచార్, కంపోస్టింగ్​, డిగ్గింగ్​ సోక్​ పిట్, పాం పాండ్స్​పై అధికారులు స్పెషల్​ ఫోకస్​ పెట్టాలన్నారు. రెవన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. బక్రీద్​ పండగ నేపథ్యంలో ఈద్గాల వద్ద వసతులు కల్పించాలన్నారు. వచ్చే నెల 1 నుంచి వన మహోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేలా ప్లాన్​ చేయాలని సూచించారు. వెదురు సాగును ప్రోత్సహించాలన్నారు.