
- కలెక్టర్ జితేశ్ వీ పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గ్రౌండింగ్ పూర్తి అయిన ఇందిరమ్మ ఇండ్లకు ఫ్రీగా ఇసుక సప్లై చేయనున్నట్టు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. పలు శాఖల ఆఫీసర్లతో గురువారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. గ్రౌండింగ్ పూర్తి అయిన ఇండ్ల నిర్మాణాలకు ఇసుక ఎన్ని ట్రక్కులు అవసరముందో ఎంపీడీవోలు తహసీల్దార్లకు నివేదికలు ఇవ్వాలన్నారు. ఇసుక రవాణాకు సంబంధించి రిజిస్టర్లో వివరాలు నమోదు చేయాలని చెప్పారు. బడిబాటను ప్రతీ గ్రామంలో నిర్వహించాలన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఏబీసీడీ డ్రైవ్ నిర్వహించాలని చెప్పారు. అజోల్లా పెంపకం, బయోచార్, కంపోస్టింగ్, డిగ్గింగ్ సోక్ పిట్, పాం పాండ్స్పై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు. రెవన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. బక్రీద్ పండగ నేపథ్యంలో ఈద్గాల వద్ద వసతులు కల్పించాలన్నారు. వచ్చే నెల 1 నుంచి వన మహోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేలా ప్లాన్ చేయాలని సూచించారు. వెదురు సాగును ప్రోత్సహించాలన్నారు.