సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

 కామారెడ్డి, వెలుగు : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ సూచించారు. మంగళవారం భిక్కనూరు మండలం జంగంపల్లిలోని పల్లె దవాఖానను తనిఖీ చేశారు. మెడిసిన్స్​స్టాక్​, రిజిస్ట్రర్​ను పరిశీలించి మాట్లాడారు.  ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఆరోగ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలన్నారు.  ఇండ్ల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వకుండా ప్రజలకు అవగాహన కల్పించి, చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్​ వెంట డీఎంహెచ్​వో డాక్టర్ చంద్రశేఖర్ ఉన్నారు.