
కామారెడ్డి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. సోమవారం పాల్వంచ మండల కేంద్రంలో ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి మాట్లాడారు. మండలంలో 34 ఇండ్లు మంజూరు కాగా, 23 ఇండ్ల నిర్మాణాలు షురూ అయ్యాయన్నారు. మండల స్పెషల్ అధికారి శ్రీపతి, తహసీల్దార్ హిమబిందు, ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ఆయూష్మాన్ సెంటర్ తనిఖీ
పాల్వంచ మండల కేంద్రంలోని ఆయూష్మాన్ (సబ్ సెంటర్)ను సోమవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధుల దృష్ట్యా డాక్టర్లు, స్టాఫ్అలర్ట్గా ఉండాలన్నారు. డీఎంహెచ్వో డాక్టర్ చంద్రశేఖర్, అధికారులు ఉన్నారు.