‘ఇందిరమ్మ’ ఇండ్లకు ఉచితంగా ఇసుక : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

‘ఇందిరమ్మ’ ఇండ్లకు ఉచితంగా ఇసుక : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక, మొరం తెచ్చుకునేందుకు పర్మిషన్ ఉందని, పంచాయతీ సెక్రటరీలకు అప్లికేషన్​ ఇవ్వాలని కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. బుధవారం అడిషనల్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో కలెక్టర్​ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఉచితంగా ఇసుక ఇవ్వటానికి  అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.  రవాణా సౌకర్యాన్ని లబ్ధిదారులు చేసుకోవాలన్నారు.  ఇసుక లభ్యత లేని మండలాల్లో పక్క మండలం నుంచి పొందవచ్చన్నారు. మొరం అవసరమైన వారు సెక్రటరీ సిఫారస్సు లేఖతో ట్రాక్టర్​కు రూ.300, టిప్పర్​కు రూ.1200 చొప్పున డీడీ చెల్లించి పర్మిషన్​ తీసుకోవాలన్నారు. ఇసుక రవాణాపై క్షేత్రస్థాయిలో ఆర్డీవోలు, ఏడీ పర్యవేక్షించాలని ఆదేశించారు.  అడిషనల్ కలెక్టర్​ విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి,  హౌజింగ్ పీడీ విజయ్​పాల్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

 కలెక్టర్​ను కలిసిన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్..​ 

కామారెడ్డి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్​గా తాజాగా బదిలీపై వచ్చిన డాక్టర్​ బి.వాలియా బుధవారం కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​ను మర్యాద పూర్వకంగా కలిశారు.   సికింద్రాబాద్​ గాంధీ హాస్పిటల్ నుంచి ఇక్కడకు బదిలీపై వచ్చారు. 
 
డిజిటల్ ఎంప్లాయీమెంట్ ఎక్సెంజీ పోస్టర్లను రిలీజ్..

కామారెడ్డిటౌన్​, వెలుగు : ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల సమన్వయంతో ఉద్యోగార్థులకు, ఉద్యోగులకు రాష్ర్ట ప్రభుత్వం  ప్రారంభించిన డిజిటల్ ఎంప్లాయీమెంట్ ఎక్సెంజీ ఆఫ్​​ తెలంగాణ అప్లికేషన్లకు సంబంధించిన పోస్టర్లను బుధవారం కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​  రిలీజ్​ చేశారు. పూర్తి వివరాలను  జిల్లా ఇండస్ట్రియల్ ఆఫీస్ కలెక్టరేట్​లోని రూమ్​ నంబర్​ 122లో సంప్రదించాలని 
సూచించారు.