ఆగష్టు 22న పల్లెల్లో పనుల జాతర నిర్వహించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

ఆగష్టు 22న పల్లెల్లో పనుల జాతర నిర్వహించాలి :  కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
  • అధికారులకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశం 

కామారెడ్డి, వెలుగు : ప్రతి పల్లెలో శుక్రవారం పనుల జాతర నిర్వహించాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​అధికారులను ఆదేశించారు.  గురువారం కలెక్టరేట్​లో అధికారులతో నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు.  గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో  అభివృద్ధి పనుల  ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనుండడంతో ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ  స్కీమ్​లో అత్యధిక పని దినాలు  చేసిన వారిని, దివ్యాంగులను,  నిబద్దతతో పని చేసిన మల్టీ పర్పస్ వర్కర్స్​, శానిటేషన్​ కార్మికులను సన్మానించనున్నట్లు తెలిపారు.  జిల్లాలో 3,347 పనులకు గాను రూ. 25 కోట్ల 23 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. 

రూ. 11 కోట్లతో 57 గ్రామ పంచాయతీ బిల్డింగ్​లు , రూ. 60 లక్షలతో 50 అంగన్​వాడీ సెంటర్లు, రూ.20 లక్షలతో 2 కిచెన్​ షెడ్లు, రూ. 2 కోట్ల 68 లక్షలతో  134  స్కూల్ టాయిలెట్స్​, రూ. 40 లక్షలతో 400  పశువుల పాకలు, రూ. 21 లక్షలతో 21 గొర్రెల షెడ్లు,   రూ. 27 లక్షలతో 27 కోళ్ల ఫారాలు, రూ. 2 లక్షలతో 13 కంపోస్టు షెడ్లు, రూ. 6 లక్షలతో 32 అజోలా ఇన్​ఫ్రా స్ర్టక్చర్స్, రూ.  కోటి 71 లక్షలతో 179 హార్టికల్చర్ ప్లాంట్లు,  రూ. కోటి 38 లక్షలతో 1,979 సోఫ్ ఫీట్స్​, రూ. 3 కోట్ల 95 లక్షలతో 426 డ్రైన్​ సోక్​ పీట్స్​, రూ. కోటి 20లక్షలతో 3 ప్లాస్టిక్​ వెస్ట్ మెనేజ్​మెంట్,  రూ.4. 50 లక్షలతో 3 షెడ్లు,  రూ. 57 లక్షలతో 19  కమ్యూనిటీ శానిటరీ కాంపెక్స్​ పనులను ప్రారంభించనున్నట్లు వివరించారు.  ఆయా గ్రామ సభల్లో స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఎంపీవోలు,  ఇంజినీర్ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొనాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీవో సురేందర్, డీపీవో మురళీ తదితరులు పాల్గొన్నారు.