
- కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, వెలుగు: అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రీషియన్ గార్డెన్స్ఏర్పాటు చేసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. అమ్మ మాట అంగన్వాడీ బాట ప్రోగ్రాంలో భాగంగా బుధవారం మాచారెడ్డి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్పాల్గొని కిచెన్ గార్డెన్లో భాగంగా బీర, సొర, కాకర వంటి తీగజాతి మొక్కలునాటారు. చిన్నారులకు ఎగ్బిర్యానీ తినిపించారు.
ఆయన మాట్లాడుతూ.. చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూడాలన్నారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకునేలా టీచర్లు ప్రోత్సహించాలన్నారు. ప్రీ స్కూల్విద్యార్థులు 100 శాతం అంగన్వాడిలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మత్తు పదార్థాల నిరోధానికి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి
మత్తు పదార్థాల నిరోధానికి విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సంగ్వాన్సూచించారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్బ్యూరో ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు.
మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు రూపొందించిన పోస్టర్లను కలెక్టరేట్లో యాంటీ నార్కోటిక్బ్యూరో నిజామాబాద్జిల్లా ఇన్చార్జి సోమనాథం, డీపీఆర్వో రవికుమార్తో కలిసి పోస్టర్లను అవిష్కరించారు. అల్ఫ్రాజోలం, క్లోరల్ హైడ్రేట్, డైజోఫాం, గంజాయి వంటి డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించేలా పని చేయాలని కలెక్టర్సూచించారు.