అంగన్వాడీల్లో న్యూట్రీషియన్ గార్డెన్స్ ఏర్పాటు చేయాలి: కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

అంగన్వాడీల్లో న్యూట్రీషియన్ గార్డెన్స్ ఏర్పాటు చేయాలి: కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
  • కలెక్టర్​ ఆశిష్ ​సంగ్వాన్​

కామారెడ్డి, వెలుగు: అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రీషియన్​ గార్డెన్స్​ఏర్పాటు చేసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్ ​సూచించారు. అమ్మ మాట అంగన్వాడీ బాట ప్రోగ్రాంలో భాగంగా బుధవారం మాచారెడ్డి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్​పాల్గొని కిచెన్​ గార్డెన్​లో భాగంగా  బీర, సొర, కాకర వంటి తీగజాతి మొక్కలు​నాటారు. చిన్నారులకు ఎగ్​బిర్యానీ తినిపించారు. 

ఆయన మాట్లాడుతూ..  చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూడాలన్నారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకునేలా టీచర్లు ప్రోత్సహించాలన్నారు. ప్రీ స్కూల్​విద్యార్థులు 100 శాతం అంగన్​వాడిలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

మత్తు పదార్థాల నిరోధానికి  అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి

మత్తు పదార్థాల నిరోధానికి విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సంగ్వాన్​సూచించారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్​బ్యూరో ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. 

మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు రూపొందించిన పోస్టర్లను కలెక్టరేట్​లో యాంటీ నార్కోటిక్​బ్యూరో నిజామాబాద్​జిల్లా ఇన్​చార్జి సోమనాథం, డీపీఆర్వో రవికుమార్​తో కలిసి పోస్టర్లను అవిష్కరించారు. అల్ఫ్రాజోలం, క్లోరల్ హైడ్రేట్, డైజోఫాం, గంజాయి వంటి డ్రగ్స్​ను పూర్తిగా నిర్మూలించేలా పని చేయాలని కలెక్టర్​సూచించారు.