
కామారెడ్డి, వెలుగు:‘భూభారతి’ అప్లికేషను క్షుణ్ణంగా పరిశీలిస్తే లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రెవెన్యూ అధికారులకు సూచించారు. శుక్రవారం రాజంపేట మండలం ఆరేపల్లిలోని రెవెన్యూ సదస్సుల్లో అప్లికేషన్లను కలెక్టర్ పరిశీలించారు. తలమడ్ల హైస్కూల్, ప్రైమరీ స్కూల్ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఎస్సెస్సీ విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ను బోర్డుపై రాస్తూ విద్యార్థులతో సాల్వ్ చేయించారు. 7, 9 క్లాస్ల్లో ఇంగ్లిష్ చదివించారు.
మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుండి భోజనం చేశారు. కిచెన్ షెడ్డు రిపేర్ కోసం రూ.50వేలు మంజూరు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఇండ్ల నిర్మాణానికి మొరం, ఇసుక సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీవో వీణ, హౌజింగ్ పీడీ విజయ్పాల్రెడ్డి,
తహసీల్దార్ జానకి తదితరులు ఉన్నారు.
ఎరువుల కొరత రాకుండా చర్యలు
కామారెడ్డిటౌన్, వెలుగు : ఎరువులు, విత్తనాల కొరత రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో జరిగిన మీటింగ్లో కలెక్టర్ మాట్లాడారు. విత్తనాలు, ఎరువులు అధిక రేట్లకు అమ్మే ఫెర్టిలైజర్స్ షాపులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలో 25వేల మెట్రిక్ టన్నుల యూరియా సొసైటీల ద్వారా సరఫరా చేశామని, ఇంకా 8వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో పామాయిల్ తోటల పెంపకానికి చర్యలు తీసుకోవాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు విక్టర్, చందర్నాయక్, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ తిరుమల ప్రసాద్, జిల్లా హార్చికల్చర్ ఆఫీసర్ జ్యోతి తదితరులు
పాల్గొన్నారు.