ఇసుక లభ్యత, పర్మిషన్లపై కమిటీ మీటింగ్

ఇసుక లభ్యత, పర్మిషన్లపై కమిటీ మీటింగ్

కామారెడ్డి​, వెలుగు : కామారెడ్డి జిల్లాలో ఇసుక లభ్యత, పర్మిషన్లకు సంబంధించిన అంశాలపై శుక్రవారం కలెక్టరేట్​లో కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ అధ్యక్షతన శాండ్​ కమిటీ మీటింగ్ నిర్వహించారు.  బిచ్​కుంద మండలం గుండెనెమిలి, హస్గుల్,   బీర్కుర్ మండలం కిష్టాపూర్,  డొంగ్లి మండలం ఖాత్లెన్, శట్లూర్ లో పట్టా భూము​ల్లో ఇసుక లభ్యత, పర్యావరణ అనుమతులపై చర్చించారు. అడిషనల్ కలెక్టర్ విక్టర్, సబ్​ కలెక్టర్ కిరణ్మయి,  జిల్లా గ్రౌండ్​ వాటర్​ అధికారి సతీశ్​యాదవ్,  మైనింగ్ ఏడీ నగేశ్​ తదితరులు పాల్గొన్నారు.  

ఎస్సెస్సీ విద్యార్థులపై స్పెషల్​ ఫోకస్​ పెట్టండి 

ఎస్సెస్సీ విద్యార్థులపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ పేర్కొన్నారు.  శుక్రవారం కలెక్టరేట్​లో నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడుతూ హెచ్​ఎంలు దీనిపై యాక్షన్​ ప్లాన్​ తయారు చేసుకొని ముందుకెళ్లాలన్నారు. మిడ్​ డే మిల్స్ నాణ్యతగా అందించాలన్నారు. ప్రైమరీ స్కూల్​లో డిజిటల్ ఏఎక్స్ఎల్​ కార్యక్రమంలో ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనేలా చూడాలన్నారు.   సబ్​ కలెక్టర్​ కిరణ్మయి తదితరులు 
పాల్గొన్నారు.