
కామారెడ్డి, వెలుగు : రేపు పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం దోమకొండ మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్, కాలేజీని కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. స్కూల్ ఆవరణలో పెరిగిన కలుపు మొక్కలను తొలగించాలని సూచించారు. వాటర్ ట్యాంక్ను క్లీన్ చేయించాలన్నారు. అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో ఏర్పాట్లు చేయాలని విద్యా సంస్థల జోనల్ ఆఫీసర్ పూర్ణచందర్రావును ఆదేశించారు. మండల స్పెషల్ ఆఫీసర్ జ్యోతి, డీఎస్డీవో వెంకటేశ్, ఎంపీడీవో ప్రవీన్ తదితరులు ఉన్నారు.
అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించాలి
భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చే అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. దోమకొండ మండలం సంగమేశ్వర్లో సదస్సును పరిశీలించారు. అప్లికేషన్లను ఆన్లైన్ చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా చేపట్టేలా అధికారులు చూడాలన్నారు. ఆర్డీవో వీణ, స్పెషల్ ఆఫీసర్ జ్యోతి తదితరులు ఉన్నారు.
మహిళా శక్తి బిల్డింగ్ వర్క్స్ కంప్లీట్ చేయాలి
జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మహిళా శక్తి బిల్డింగ్ వర్క్స్ను నవంబర్లోగా కంప్లీట్ చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. బిల్డింగ్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలన్నారు. పీఆర్ డీఈ స్వామిదాస్ ఉన్నారు.