విద్యార్థులకు అసౌకర్యం కలగొద్దు : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

విద్యార్థులకు అసౌకర్యం కలగొద్దు : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, వెలుగు : రేపు పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ అధికారులను ఆదేశించారు.  మంగళవారం దోమకొండ మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్, కాలేజీని కలెక్టర్​ పరిశీలించి మాట్లాడారు.  స్కూల్​ ఆవరణలో పెరిగిన కలుపు మొక్కలను తొలగించాలని సూచించారు.  వాటర్ ట్యాంక్​ను క్లీన్ చేయించాలన్నారు. అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్​లో ఏర్పాట్లు చేయాలని విద్యా సంస్థల జోనల్ ఆఫీసర్ పూర్ణచందర్​రావును ఆదేశించారు.  మండల స్పెషల్ ఆఫీసర్​ జ్యోతి,  డీఎస్​డీవో వెంకటేశ్​, ఎంపీడీవో ప్రవీన్ తదితరులు ఉన్నారు.  

అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించాలి 

భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చే అప్లికేషన్లను క్షుణ్ణంగా  పరిశీలించాలని కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​ అధికారులను ఆదేశించారు.  దోమకొండ మండలం సంగమేశ్వర్​లో సదస్సును పరిశీలించారు.  అప్లికేషన్లను ఆన్​లైన్​ చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా చేపట్టేలా అధికారులు చూడాలన్నారు.   ఆర్డీవో వీణ, స్పెషల్ ఆఫీసర్​ జ్యోతి తదితరులు ఉన్నారు.

మహిళా శక్తి బిల్డింగ్ వర్క్స్​ కంప్లీట్​ చేయాలి 

జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మహిళా శక్తి బిల్డింగ్ వర్క్స్​ను నవంబర్​లోగా కంప్లీట్ చేయాలని  కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ పేర్కొన్నారు. బిల్డింగ్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలన్నారు.  పీఆర్​ డీఈ స్వామిదాస్​ ఉన్నారు.