వరికి బదులుగా ఆయిల్ పామ్ సాగు చేపట్టాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​

వరికి బదులుగా ఆయిల్ పామ్ సాగు చేపట్టాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​

 కామారెడ్డి టౌన్, వెలుగు :  జిల్లాలో  రైతులు వరి సాగుకు బదులుగా ఆయిల్​ పామ్ సాగు చేస్తే మేలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు.  సోమవారం బీబీపేట మండలం యాడారంలో ఆయిల్ పామ్​ సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. ఆయిల్​ పామ్​ సాగులో లేబర్​ ఖర్చు తక్కువగా ఉంటుందని,  డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్​తో తక్కువ నీటితో సాగు చేయవచ్చన్నారు.   దిగుబడి కూడా బాగానే ఉంటుందని, జిల్లాకు ఇచ్చిన టార్గెట్​ను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్​ జ్యోతి,  కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.  యాడారంలో ఆయిల్​ పామ్​ మొక్కలను కలెక్టర్ నాటారు. 

మాక్​ డ్రిల్​లో ఆయా శాఖల అధికారులు పాల్గొనాలి 

 వర్షకాలంలో వరదలు, విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను అలర్ట్​చేయడానికి ఎన్డీఆర్ఎఫ్ ద్వారా మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో  మాక్​ డ్రిల్​ చేపట్టనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సోమవారం ఆయా శాఖల అధికారులతో మీటింగ్ నిర్వహించారు. జీవదాన్ స్కూల్, జీఆర్​ కాలనీ ఏరియాలో నిర్వహించే మాక్​ డ్రిల్​లో ఆయా శాఖల అధికారులు పాల్గొనాలన్నారు.  అడిషనల్ కలెక్టర్ వి.విక్టర్, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, డీఎంహెచ్​వో చంద్రశేఖర్,  ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శ్రావణ్​కుమార్,  ఆర్అండ్​బీ ఈఈ రవిశంకర్, డీపీవో మురళీ, జిల్లా ఫైర్ ఆఫీసర్ సుధాకర్ పాల్గొన్నారు.