
కామారెడ్డి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక, మొరం సమస్య లేదని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం రాజంపేట మండలంలోని ఆర్గొండలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మా ణ పనులను పరిశీలించి మాట్లాడారు. ఇక్కడ 27 ఇండ్లు మంజూరు కాగా, 16 ఇండ్లకు మార్కవుట్ ఇవ్వగా 7 బేస్మిట్ లేవల్కు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.
8 మంది లబ్ధిదారులు వివిధ కారణాలతో నిర్మాణాలు చేపట్టలేదన్నారు. అనంతరం ప్రైమరీ స్కూల్ను కలెక్టర్ పరిశీలించారు. మిడ్ డే మీల్స్ తనిఖీ చేశారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. హౌజింగ్ పీడీ జయపాల్రెడ్డి, డీఈవో రాజు తదితరులు ఉన్నారు.