
కామారెడ్డి టౌన్, వెలుగు : జిల్లాలో నకిలీ విత్తనాల సరఫరాపై ఫోకస్ పెట్టాలి.. అగ్రికల్చర్, పోలీసు శాఖ అధికారులతో కలిసి టాస్క్ఫోర్స్ టీమ్ తనిఖీలు చేయాలి.. బిచ్కుంద డివిజన్లో నకిలీ విత్తనాలపై నిఘా పెట్టాలి’ అని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అగ్రికల్చర్, హార్టికల్చర్, డీఆర్డీవో అధికారులతో నిర్వహించిన రివ్యూలో కలెక్టర్ మాట్లాడారు. ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కానున్నాయని, సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు.
పెద్దకొడప్ గల్ మండలంలో రైతు బీమా చెల్లింపుల డాక్యుమెంట్స్ అప్లోడ్లో డీలే జరుగుతుందన్నారు. వడగండ్ల వానలకు జిల్లాలో 193 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. నిర్ధేశించిన లక్ష్యం మేర 3 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటల పెంపకానికి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్డీవో సురేందర్, జిల్లా అగ్రీకల్చర్ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా హార్టికల్చర్ అధికారి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ఇసుక లభ్యతపై మీటింగ్
డిస్ర్టిక్ లెవల్ సాండ్ కమిటీ మీటింగ్ బుధవారం జరిగింది. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ స్థానిక అవసరాల కోసం హస్గుల్, కుర్లా లలో ఇసుక లభ్యత, స్థానిక తహసీల్ధార్ పర్మిషన్పై చర్చించారు. ఇసుక అక్రమ రవాణా నిరోధించేందుకు చెక్పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ విక్టర్, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.