పారిశుధ్య పనులు చేపట్టాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

పారిశుధ్య పనులు చేపట్టాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
  • కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​

కామారెడ్డిటౌన్​, వెలుగు : గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీ,  రామారెడ్డి రోడ్డు, సిరిసిల్లా రోడ్డులో శానిటేషన్​ పక్రియను పరిశీలించి మాట్లాడారు. నీరు నిల్వ  ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు.  డ్రైనేజీలు క్లీన్​ చేయించి, దోమలు వ్యాప్తి చెందకుండా అయిల్​ బాల్స్  వేయాలన్నారు.  వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లు చేయించాలని కమిషనర్ రాజేందర్​రెడ్డిని ఆదేశించారు.  వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటాలన్నారు. అడిషనల్​ కలెక్టర్​ చందర్​నాయక్​ తదితరులు ఉన్నారు.  

ఇందిరమ్మ ఇండ్లు స్పీడప్ చేయాలి 

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను స్పీడప్​ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  గురువారం నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడుతూ వర్షాలు తగ్గుముఖం పట్టినందున అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలన్నారు. అడిషనల్ కలెక్టర్​ చందర్​నాయక్​,  హౌజింగ్​ పీడీ విజయపాల్​రెడ్డి,  డీపీవో మురళీ పాల్గొన్నారు.