విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలి : కలెక్టర్ హైమావతి

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలి : కలెక్టర్ హైమావతి

ములుగు, వెలుగు: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. మంగళవారం మండలంలోని క్షీరసాగర్, జడ్పీ హైస్కూల్​, ఒంటిమామిడి ప్రైమరీ స్కూల్​ను  ఆకస్మికంగా సందర్శించారు. మెనూ ప్రకారం కాకుండా అన్నం, కూర మాత్రమే వండినందుకు ఒంటిమామిడి స్కూల్​సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 సాంబార్ చేయకుండా ఒక కూర విద్యార్థులకు సరిపోతుందా అని ప్రిన్సిపాల్ పైన మండిపడ్డారు. వంటగది పరిసరాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని, వంట సిబ్బందిని ఆదేశించారు. తరగతికి వెళ్లి కాసేపు విద్యార్థులతో  మాట్లాడారు.