
యాదాద్రి, వెలుగు : స్కూల్స్, హాస్టల్స్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్హనుమంతరావు వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన వైద్యారోగ్య శాఖ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ప్రతి స్టూడెంట్కు వైద్య పరీక్షలు చేయాలన్నారు. హాస్టల్స్కు కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కు హోమ్ సిక్ ఉంటుందని, అలాంటి వారిని కలిసి మాట్లాడి, కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. పీహెచ్సీ, సీహెచ్సీల్లో డాక్టర్లు ఎప్పటికీ అందుబాటులో ఉండాలని సూచించారు.
అనంతరం గర్భిణులకు నార్మల్ డెలివరీ గురించి వివరించాలని చెప్పారు. సమావేశంలో డీఎంహెచ్వో డాక్టర్మనోహర్, డిప్యూటీ డీఎంహెచ్వో యశోద, ప్రోగ్రాం ఇన్చార్జిలు సాయి శోభ, శిల్పిని, రామకృష్ణ, సుమన్ కల్యాణ్, అంజయ్య పాల్గొన్నారు.