ఎన్నికల్లో నోడల్ ఆఫీసర్ల పాత్ర కీలకం : కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఎన్నికల్లో నోడల్ ఆఫీసర్ల పాత్ర కీలకం :  కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్,  వెలుగు:  మున్సిపాలిటీ ఎన్నికల్లో నోడల్ ఆఫీసర్ల పాత్ర కీలకమని కలెక్టర్​ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్​లో నోడల్ అధికారులతో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని, అప్పగించే బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చాలన్నారు. ఎలక్షన్​ కమిషన్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని, శాఖల మధ్య సమన్వయం ముఖ్యమని సూచించారు. 

సబ్ కలెక్టర్లు వికాస్​మహాతో, అభిగ్యాన్​ మాల్వియా, ఆర్డీవో రాజేంద్రకుమార్, నగర పాలక కమిషనర్ దిలీప్​కుమార్ తదితరులు పాల్గొన్నారు. తరువాత నిర్వహించిన మరో మీటింగ్​లో యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, కస్తూర్బా, నర్సింగ్ స్కూల్, హెల్త్​ సబ్​ సెంటర్స్, అంగన్​వాడీ, లైబ్రరీల నిర్మాణాలకు స్థలాలు గుర్తించాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. సర్కార్​ జాగాలు ఆక్రమణకు గురైతే అక్కడి ఆఫీసర్లను బాధ్యులను చేస్తామని పేర్కొన్నారు.