వడదెబ్బ నుంచి రక్షించుకుందాం .. పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

వడదెబ్బ నుంచి రక్షించుకుందాం .. పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

ములుగు, వెలుగు : వేసవిలో ఎండతీవ్రత ఎక్కువగా ఉండగా, ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయని, ప్రజలు వడదెబ్బ నుంచి తమను తాము రక్షించుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో డీఎంహెచ్​వో డాక్టర్​ అప్పయ్య ఆధ్వర్యంలో వైద్యారోగ్య శాఖ రూపొందించిన ‘వడదెబ్బ నుంచి రక్షించుకుందాం’ అనే వాల్ పోస్టర్ ను అడిషనల్​కలెక్టర్ శ్రీజతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డీపీవో స్వరూప, ప్రోగ్రాం ఆఫీసర్​ పవన్ ​ పాల్గొన్నారు.