
- జాతీయ స్థాయి సెమినార్లో కలెక్టర్ జితేశ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పత్తి పంట కంటే మునగ సాగుతో రైతులకు ఆదాయం ఎక్కువగా వస్తుందని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆస్పిరేషనల్డిస్ట్రిక్ట్ అండ్ బ్లాక్స్పై గురువారం నిర్వహించిన జాతీయ స్థాయి సెమినార్లో ఆయన జిల్లాలో చేపడుతున్న మునగ సాగుపై వివరించారు. మునగ సాగు వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించడంతో వారు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం 415 ఎకరాల్లో మునగ సాగు అవుతుందని చెప్పారు. అంతరపంటగానూ మునగ సాగును రైతులు చేపడుతున్నారన్నారు.