భద్రాచలం, వెలుగు : భద్రాచలం గోదావరి తీరంలో ఏరు ఉత్సవాల్లో సాంస్కృతిక వేడుకలకు పెద్దపీట వేస్తున్నారు. ఈ మేరకు తెప్పోత్సవం నిర్వహించే ర్యాంపు సమీపంలో స్థానిక చిన్నారులతో కూచిపూడి, భరత నాట్యం లాంటి శాస్త్రీయ నృత్యాలు నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఈవెంట్ నిర్వాహకులతో కలిసి ఏర్పాట్లను శుక్రవారం గోదావరి స్నానఘట్టాల వద్ద పర్యవేక్షించారు.
ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు తిలకించేందుకు వచ్చే భక్తులకు కనుల, వీనుల విందు చేయడం లక్ష్యంగా కలెక్టర్ ప్రోగ్రామ్లు ఏర్పాటు చేస్తున్నారు. గోదావరికి నదీహారతులు కూడా నిర్వహించనున్నారు. ఆధ్యాత్మికతతో పాటు సాంస్కృతిక వేడుకలతో భక్తులను మైమరిపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
