మాతాశిశు మరణాలు లేకుండా చూడాలి :  కలెక్టర్ జితేశ్వి.పాటిల్

మాతాశిశు మరణాలు లేకుండా చూడాలి :  కలెక్టర్ జితేశ్వి.పాటిల్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: మాతాశిశు మరణాలు లేని సమాజం కోసం వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్​ జితేశ్​వి.పాటిల్​సూచించారు. కలెక్టరేట్​లో గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి ఆరోగ్య సమీక్షలో ఆయన మాట్లాడారు. మాతాశిశు మరణాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకొని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ గర్భిణి వివరాలను పీసీ అండ్​పీఎన్​డీటీ పోర్టల్​లో నమోదు చేయాలని చెప్పారు. ప్రైవేట్​హాస్పిటళ్ల యాజమాన్యాలు అర్హులైన డాక్టర్లనే నియమించుకోవాలని సూచించారు. డీఎంహెచ్​వో భాస్కర్​నాయక్, మెజిస్ట్రేట్​రవికుమార్, డీఎస్పీ రెహమాన్​ తదితరులున్నారు.