
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: మాతాశిశు మరణాలు లేని సమాజం కోసం వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ జితేశ్వి.పాటిల్సూచించారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి ఆరోగ్య సమీక్షలో ఆయన మాట్లాడారు. మాతాశిశు మరణాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకొని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ గర్భిణి వివరాలను పీసీ అండ్పీఎన్డీటీ పోర్టల్లో నమోదు చేయాలని చెప్పారు. ప్రైవేట్హాస్పిటళ్ల యాజమాన్యాలు అర్హులైన డాక్టర్లనే నియమించుకోవాలని సూచించారు. డీఎంహెచ్వో భాస్కర్నాయక్, మెజిస్ట్రేట్రవికుమార్, డీఎస్పీ రెహమాన్ తదితరులున్నారు.