
భద్రాద్రికొత్తగూడెం/భద్రాచలం/పాల్వంచ, వెలుగు : గోదావరి వరదల పట్ల అలర్ట్గా ఉండాలని జిల్లాలోని అన్నిశాఖల అధికారులను భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ఆదేశించారు. గోదావరి వరదలపై మంగళవారం నిర్వహించిన రివ్యూమీటింగ్లో ఎస్పీరోహిత్రాజ్, అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్, ఐటీడీఏ పీవో బి.రాహుల్, ఏఎస్పీ విక్రాంత్ సింగ్ కుమార్తో కలిసి ఆయన మాట్లాడారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రతీ అధికారి వాహనంలో లైఫ్ జాకెట్లు, టార్చిలైట్లు, తాడు, హ్యాండ్ మైక్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ముందస్తు ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రణాళిక తయారు చేయాలన్నారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
గజ ఈతగాళ్లు, నాటుపడవలు, బోట్లు ముంపు ప్రాంతాల్లో సిద్ధం చేయాలన్నారు. రానున్న మూడు నెలలకు సరిపడా బఫర్స్టాక్ను జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు ముంపు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని చెప్పారు. ముంపు చర్యల పర్యవేక్షణకు సెక్టోరియల్, జోనల్ అధికారులను నియమిస్తామన్నారు. వరద సమాచారం చేరవేసేందుకు అన్ని గ్రామాల్లోని ముఖ్యుల ఫోన్ నెంబర్లను సేకరించాలని చెప్పారు. అత్యవసర సేవలకు హెలీకాప్టర్లను వినియోగించుకునేందుకు హెలీప్యాడ్లు నిర్మించాలని ఆర్అండ్బీ ఇంజినీర్లను ఆదేశించారు. కిన్నెరసాని, తాలిపేరు ఇతర ప్రాజెక్టుల గేట్లు ఎత్తే విషయంలో ప్రభావిత గ్రామాలకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలన్నారు.
భద్రాచలం సబ్కలెక్టర్ ఆఫీసుతో పాటు, జిల్లా కేంద్రం, అన్ని మండల కేంద్రాల్లో 24 గంటలు పనిచేసేలా ఫ్లడ్ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాగులు, నదులు ప్రజలు దాటకుండా బారికేడ్లు పెట్టాలన్నారు. పాముకాట్లకు సంబంధించి వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. సింగరేణి, కేటీపీఎస్, ఐటీసీ, నవభారత్ సంస్థల నుంచి రెస్క్యూ టీంల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అన్ని హైలెవల్ బ్రిడ్జిల వద్ద ప్రమాదహెచ్చరిక బోర్డులు పెట్టాలని, దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద బ్రిడ్జి నిర్మాణపు పనులు ఆగస్టు 15లోగా పూర్తి చేయాలన్నారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేశ్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో మంగళవారం ఎస్పీ రోహిత్రాజ్తో కలిసి రహదారి భద్రతపై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతాలను గుర్తించి సైన్బోర్డులతో పాటు, రేడియం స్టిక్కర్లు, జీబ్రాలైన్లు లాంటివి ఏర్పాటు చేయాలన్నారు. రహదారులపై ఉన్న గుంతలను వెంటనే పూడ్చేయాలని ఆదేశించారు. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ చికిత్స కోసం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ తరుఫున పక్కా ప్రణాళిక రూపొందించాలని డీఎంహెచ్వోను ఆదేశించారు.
జిల్లాలోని ప్రతీ నియోజకవర్గంలో సీపీఆర్ మానిక్యూర్ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగూడెం మున్సిపాల్టీ పరిధిలో పెద్ద బజార్, చిన్నబజార్ ప్రాంతాలలో పార్కింగ్ కోసం అనువైన స్థలాన్ని గుర్తించాలని ఆదేశించారు. అనంతరం రహదారి భద్రతపై రూపొందించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు.
డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
భద్రాద్రికొత్తగూడెంను డ్రగ్స్ రహిత జిల్లా గా తీర్చిదిద్దాలని కలెక్టర్ జితేశ్ పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి యాంటీ డ్రగ్ కమిటీ మీటింగ్లో ఎస్పీ రోహిత్రాజ్ తో కలిసి ఆయన మాట్లాడారు. విద్యార్థులు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్, గంజాయి వినియోగం వల్ల కల్గే అనర్థాలపై విద్యాసంస్థల్లో నిర్వహించే పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ల్లో అవగాహన కల్పించాలన్నారు. బార్డర్లలో చెక్పోస్టులు పటిష్టంగా పనిచేయాలని ఆదేశించారు. డ్రగ్స్ వినియోగించినా, రవాణా చేసినా పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని ఎస్పీ రోహిత్ రాజ్ హెచ్చరించారు.
అర్హులందరికీ రైతుభరోసా
జిల్లాలో అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకం అమలు చేస్తామని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు.
అంగన్వాడీ కేంద్రాల్లో కార్పొరేట్ వసతులు
అంగన్వాడీ కేంద్రాలకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించటమే తమ ధ్యేయమని కలెక్టర్ జితేశ్వీ పాటిల్ అన్నారు. పాల్వంచ పట్టణంలోని పాత పాల్వంచ అంగ న్వాడీ కేంద్రంలో ‘అమ్మమాట అంగన్వాడీ బాట’ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. చిన్నారులకు పుస్తకాలు, బ్యాగులు, షూస్, పలకలు, గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లావ్యా ప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ప్రహరీ గోడల నిర్మాణం చేపట్టామని, విద్యుత్ సౌకర్యం కల్పించి ఫ్యాన్లు విద్యుత్ దీపాలు వెలిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. భవిష్యత్లో అం గన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మిస్తామని చెప్పారు. పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించి ఆర్థిక భారాన్ని మోయకుండా తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు.