ఎన్యూమరేటర్లు ట్రైనింగ్లో నేర్చుకున్న అంశాలను ఫీల్డ్లో అమలు చేయాలి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్

 ఎన్యూమరేటర్లు ట్రైనింగ్లో నేర్చుకున్న అంశాలను ఫీల్డ్లో అమలు చేయాలి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్

పినపాక, వెలుగు: ఎన్యూమరేటర్లు ట్రైనింగ్​లో నేర్చుకున్న అంశాలను  ఫీల్డ్​లో అమలు చేస్తూ సెన్సస్​ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ సూచించారు. జనగణన ఎన్యూమరేటర్లు, సూపర్​వైజర్లకు మండలంలోని రైతువేదికలో మూడు రోజులపాటు నిర్వహించనున్న ట్రైనింగ్​ ను ఆయన ఆదివారం ప్రారంభించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణన కోసం పినపాక మండలంలోని ఏడు రెవెన్యూ విలేజ్​లను పైలట్​ ప్రాజెక్ట్​ కింద కేంద్రం ఎంపిక చేసిన నేపథ్యంలో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. డిజిటల్​పద్ధతిలో వివరాలు సేకరించాల్సి ఉన్నందున్న ఎన్యూమరేటర్లు సంబంధిత సమాచారాన్ని ఎటువంటి పొరపాట్లకు తావీయకుండా నమోదు చేయాలని చెప్పారు. ఈ వివరాల సేకరణ జనగణన కోసం మాత్రమేనని, వీటితో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యకరమంలో తహసీల్దార్, జనగణన పైలట్​ ప్రాజెక్ట్​ ఆఫీసర్లు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు పటిష్ట ఏర్పాట్లు

భద్రాద్రికొత్తగూడెం జిల్లా  పినపాక మండలం ఏడూళ్లబయ్యారం జడ్పీ స్కూల్​లో ఈ నెల 8నుంచి మూడురోజుల పాటు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి బాలబాలికల అండర్-17 కబడ్డీ పోటీల ఏర్పాట్లు ‌‌పటిష్టంగా చేయాలని కలెక్టర్​ జితేశ్​ అధికారులను ఆదేశించారు.  ఆదివారం మండలంలో పర్యటించిన ఆయన కబడ్డీ పోటీల ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. కలెక్టర్​ వెంట ఎంపీవో వెంకటేశ్వర్లు, ట్రాన్స్​కో ఏఈ వేణుగోపాల్, కంది ఫౌండేషన్​ చైర్మన్​ కంది సుబ్బారెడ్డి, పీడీ బి.వీరన్న, తదితరులు పాల్గొన్నారు.