భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలోని అర్హులైన మహిళలందరికీ చీరలను పంపిణీ చేస్తామని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్అన్నారు. కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో బుధవారం సమావేశమై మాట్లాడారు. ఈ నెల 19 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు గ్రామ స్థాయిలో, మార్చి ఒకటో తేదీ నుంచి 8 వరకు పట్టణ ప్రాంతాల్లో చీరలు అందించనున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
చిన్న నీటి వనరులను లెక్కించాలి
జిల్లాలోని చిన్న నీటి వనరుల లెక్కను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్జితేశ్ వి.పాటిల్ఆదేశించారు. బుధవారం తన క్యాంప్ఆఫీస్లో అధికారులతో సమావేశమై మాట్లాడారు. ఐదేండ్లకోసారి చిన్న నీటి వనరులను లెక్కిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 2 వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న చెరువులు, కుంటలు, బోర్లు, బావులు, చెక్డ్యాంలను మొబైల్ అప్లికేషన్ద్వారానే లెక్కించాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని చెప్పారు.
మొదట ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని, నమూనా గణన పూర్తి చేసిన తర్వాత మిగిలిన గ్రామాల్లో చేపట్టాలన్నారు. అడిషనల్ కలెక్టర్ విద్యాచందన, సీపీవో సంజీవరావు, భూగర్భ జలాల అభివృద్ధి శాఖ అధికారి రమేశ్, ఇరిగేషన్ ఈఈ అర్జున్పాల్గొన్నారు.
