దేశాభివృద్ధికి యువత కృషి చేయాలి : భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్

దేశాభివృద్ధికి యువత కృషి చేయాలి : భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సర్దార్​ వల్లభాయ్​పటేల్​ స్ఫూర్తితో యువత దేశ సమగ్రత, అభివృద్ధి దిశగా కృషి చేయాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​వి పాటిల్​ సూచించారు. కలెక్టరేట్​లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సర్దార్​@150 ఐక్యత పాదయాత్ర ప్రోగ్రామ్స్​ను  ఆయన వివరించారు. దేశ సమగ్రత, ప్రజాస్వామ్య విలువలు, దేశభక్తి భావనలు బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

వ్యాసరచన, సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. జిల్లాలో ఈ నెల 1 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఐక్యత పాదయాత్రలు, ఆరోగ్య శిబిరాలు, వల్లభాయ్​ పటేల్​ జీవితంపై ప్రసంగాలు, ఆత్మనిర్బర్​ భారత్​ ప్రతిజ్ఞలు, సర్టిఫికెట్​ ప్రదానం లాంటి ప్రోగ్రామ్స్​ చేపట్టనున్నట్టు వివరించారు.  విత్తన కార్యక్రమంలో భాగంగా అశ్వాపురం ఎంపీపీ స్కూల్​ స్టూడెంట్స్​ 40 రకాల 400 కిలోల విత్తానలను సేకరించడం అభినందనీయమన్నారు. 

హైదరాబాద్​లోని ఎన్ఎస్టీ సంస్థ ద్వారా ఫర్నీచర్​ తయరీ రంగంలో మూడు నెలల పాటు ట్రైనింగ్​ పూర్తి చేసుకున్న ఎనిమిది మంది రూ. 15వేల వేతనంతో ఆర్నెళ్ల పాటు అప్రెంటీస్​ షిప్​  పొందుతున్నారని చెప్పారు. ఈ నెల 6 నుంచి రెండో విడత ట్రైనింగ్​ ప్రోగ్రామ్ ఉంటుందన్నారు. 18ఏండ్ల నుంచి 30ఏండ్ల వయసు గల నిరుద్యోగ గిరిజన యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

ఎస్​ఐఆర్​ సన్నాహక ప్రక్రియను పూర్తిచేయాలి

జిల్లాలో ప్రత్యేక ఇన్సెంటివ్​ రివిజన్​ (ఎస్​ఐఆర్​ ) సన్నాహక ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకనుగుణంగా నిర్ధిష్ట గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్​ ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్​ నుంచి ఆయన టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు.

 2002 సంవత్సరపు ఓటర్ల జాబితాను 2025 సంవత్సరం జాబితాతో మ్యాపింగ్​ చేసి నాలుగు కేటగిరీలుగా విభజించినట్టు తెలిపారు. ప్రజా పాలన, రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన సాదా బైనామాలు, అసైన్డ్​ భూముల పెండింగ్​ దరఖాస్తులను ఈ నెల 3 లోపు పరిష్కరించాలన్నారు. తిరస్కరించిన దరఖాస్తులపై కారణాలను స్పష్టంగా నమోదు చేయాలని ఆదేశించారు.