
సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డిలో జిల్లా పాత కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మించే కలెక్టర్ క్యాంప్ఆఫీస్భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ క్రాంతి ఆర్ అంండ్ బీ అధికారులను ఆదేశించారు. ఆదివారం రోడ్డు భవనాల శాఖ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి కలెక్టర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.
సుమారు రూ. 2.5 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా నిర్మించాలని అధికారులకు సూచించారు. ఆమె వెంట ఆర్అండ్ బీ డీఈ రామకృష్ణ, ఇంజినీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.