వికారాబాద్ జిల్లాలో సాహిత్య రంగాన్ని ప్రోత్సహిస్తం : నారాయణ రెడ్డి

వికారాబాద్ జిల్లాలో సాహిత్య రంగాన్ని ప్రోత్సహిస్తం : నారాయణ రెడ్డి

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లాలో భాషా సాహిత్య రంగాలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.  తెలంగాణ సారస్వత పరిషత్ ఇటీవల ప్రచురించిన ‘వికారాబాద్ జిల్లా సమగ్ర స్వరూపం’ గ్రంథాన్ని పరిషత్  ప్రధాన కార్యదర్శి డాక్టర్  జె. చెన్నయ్య సోమవారం కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందజేసి సత్కరించారు.  ఈ సందర్భంగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ..  భాషా సాహిత్యాలకు తగిన ప్రోత్సాహం అందిస్తామన్నారు.

 తెలంగాణ సారస్వత పరిషత్ ప్రచురించిన గ్రంథాన్ని అందరికీ అందించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.  ప్రతి ఒక్కరు తమ జిల్లా గొప్పదనం గురించి తెలుసుకోవాలని ఆయన సూచించారు. చెన్నయ్య మాట్లాడుతూ..  తెలంగాణ సారస్వత పరిషత్ 80 ఏండ్లుగా  తెలుగు భాషా పరిరక్షణకు కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో అవధాని అంజయ్య పాల్గొన్నారు.