పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి :  కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి :  కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ అర్బన్, వెలుగు : పెండింగ్​ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, సాదాబైనామా పరిష్కారంలో జాగ్రత్తగా వ్యవహరించాలని జనగామ కలెక్టర్​ సందీప్​ కుమార్​ ఝా అన్నారు. మంగళవారం కలెక్టరేట్​లో భూ భారతి, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై అడిషనల్ కలెక్టర్ బెన్​ షాలోమ్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఆయా మండలాల వారీగా పెండింగ్ దరఖాస్తుల ప్రక్రియపై సమీక్షించి, పలు సూచనలు చేశారు. సమీక్షలో ఆర్డీవోలు గోపీరాం, వెంకన్న, తహసీల్దార్లు పాల్గొన్నారు.