
మెదక్ టౌన్, చేగుంట, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లను ఎంత త్వరగా పూర్తిచేస్తే అంత త్వరగా బిల్లులను చెల్లిస్తామని కలెక్టర్రాహుల్రాజ్అన్నారు. మంగళవారం చేగుంట మండలం పులిమామిడి, బోనాల గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టర్మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 9,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 5,000 గ్రౌండింగ్ అయి వివిధ దశల్లో ఉన్నాయని, మిగిలిన ఇండ్ల లబ్ధిదారులు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించేలా అధికారులు ప్రోత్సహించాలన్నారు.
ఇండ్ల నిర్మాణపు పనులు పూర్తి చేయడంలో జిల్లాను ముందు వరుసలో ఉంచాలని కోరారు. అనంతరం చేగుంట మండలంలోని పులిమామిడిలో అంగన్వాడీ కేంద్రం, ప్రైమరీ స్కూల్ను కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని అమలుచేయాలన్నారు. అనంతరం అంగన్వాడీ స్కూల్ను సందర్శించి ప్రశ్నలు సమాధానాలతో పిల్లల సామర్థ్యాలను పరీక్షించారు.