ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరాలి

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరాలి
  • మెదక్​ జిల్లా నూతన కలెక్టర్​గా బాధ్యతలు స్వీకరించిన ప్రతిమాసింగ్​

మెదక్​ టౌన్​, వెలుగు :  ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరాలని మెదక్​ జిల్లా నూతన కలెక్టర్​ ప్రతిమాసింగ్​ అన్నారు. గురువారం ఆమె  కలెక్టర్​ ఛాంబర్​లో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు మెదక్​ జిల్లా కలెక్టర్​గా విధులు నిర్వహించిన రాహుల్​ రాజ్​ బదిలీపై  వెళ్లారు.   ఈ సందర్భంగా కలెక్టర్​ ప్రతిమాసింగ్​కు జిల్లా అడిషనల్​ కలెక్టర్​ నగేష్​, అధికారులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.

అనంతరం కలెక్టర్​ ప్రతిమాసింగ్​ మాట్లాడుతూ... ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి  పథకాలు ప్రజలకు అందేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. అలాగే ఇంటర్, పదో తరగతి పరీక్షల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నూతన కలెక్టర్​గా వచ్చిన ప్రతిమాసింగ్​కు జిల్లా అడిషనల్​ కలెక్టర్ నగేష్, డీఆర్​వో భుజంగరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, మెదక్ ఆర్డీవో రమాదేవి పూలమొక్క అందించి స్వాగతం పలికారు.