పోలీసు శాఖకు రెండు పెట్రోల్ బంక్లు

పోలీసు శాఖకు రెండు పెట్రోల్ బంక్లు

మెదక్​ టౌన్​, వెలుగు :  మెదక్​ జిల్లాలో పోలీసు శాఖకు సంబంధించి రెండు పెట్రోల్​ బంకులు మంజూరయ్యాయని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్​ రావు అన్నారు. మెదక్​ పట్టణం, చిన్నశంకరంపేటలో ఇండియన్​ ఆయిల్​   బంక్​లు మంజూరయ్యాయి. మెదక్​ లోని  రూరల్​ పోలీస్​స్టేషన్​ పక్కన, చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఈ పంపులు ఏర్పాటు చేస్తున్నట్టు  తెలిపారు.  చిన్నశంకరంపేట పెట్రోల్ బంకు నిర్మాణ పనులు ప్రస్తుతం పురోగతిలో ఉండగా... గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న పెట్రోల్​బంకుకు శంకుస్థాపన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాస్​ రావు మాట్లాడుతూ... నిర్మాణ పనులు పూర్తయిన అనంతరం ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఏఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్నకుమార్, రంగనాథ్, సీఐలు జార్జ్​, రాజశేఖర్ రెడ్డి, సందీప్ రెడ్డి, కృష్ణ మూర్తి,  ఆర్ఐ శైలందర్, రామకృష్ణ, ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.