గోవధ చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు : కలెక్టర్ రాజీవ్ గాంధీ​

గోవధ చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు : కలెక్టర్ రాజీవ్ గాంధీ​

నిజామాబాద్, వెలుగు : గోవులను వధించడం 1977 చట్టం ప్రకారం నేరమని నిజామాబాద్ కలెక్టర్  రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. శనివారం జంతు సంక్షేమం, గోవధ నిషేధ సమన్వయ కమిటీ మీటింగ్​లో కలెక్టర్​మాట్లాడారు. గోవులతో పాటు ఒంటెల వధింపుపై స్టేట్​లో నిషేధం కొనసాగుతుందన్నారు. బక్రీద్ పేరుతో జరిగే గోవుల రవాణాపై ఆఫీసర్స్ ఫోకస్​ పెట్టాలన్నారు. వెటర్నరీ డాక్టర్ సర్టిఫై చేసే పశువులను మాత్రమే స్లాటర్ హౌజ్​లో వధించాలన్నారు. ఎక్కడ పడితే అక్కడ కోయడానికి వీలులేదన్నారు.

బార్డర్​లో చెక్​ పోస్టుల ఏర్పాటు : సీపీ   

బక్రీద్ పేరుతో పక్క రాష్ట్రాల నుంచి పశువుల అక్రమ రవాణా జరగకుండా బార్డర్​లో చెక్ పోస్ట్​లు ఏర్పాటు చేశామని సీపీ సాయి చైతన్య తెలిపారు. కందకుర్తి, సాలూరా, పోతంగల్, ఖండ్​గావ్​లో అంతర్​రాష్ట్ర చెక్​పోస్టులు, సాటాపూర్​, యంచ, ఇందల్వాయి, ఉమ్మెడ, జన్నేపల్లి, మామిడిపల్లి విలేజ్​లలో అంతర్​జిల్లా చెక్​ పోస్టులు పెట్టామన్నారు. రెవెన్యూ, పోలీస్​, ట్రాన్స్ పోర్ట్​ శాఖ ఆఫీసర్లు సమన్వయంతో పని చేస్తే ఫలితాలు వస్తాయన్నారు.

పట్టుబడిన గోవులను గ్రాసం, తాగునీరు ఉన్న షెల్టర్లకు తరలించాలన్నారు. జంతు సంరక్షణ చట్టానికి లోబడి పశువుల క్రయవిక్రయాలు నిర్వహించాలని, వ్యర్థాలను జనావాసాలకు దూరంగా పడేయాలన్నారు. బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో, నగర పాలక కమిషనర్ దిలీప్​కుమార్, ట్రాన్స్ పోర్ట్​ ఆఫీసర్​ ఉమామహేశ్వర్​రావు, ట్రాన్స్​కో ఎస్ఈ రవీందర్, ఏసీపీలు రాజా వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్వర్​రెడ్డి తదితరులు ఉన్నారు.