నిజామాబాద్ జిల్లాలో జీపీవో పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు 

నిజామాబాద్ జిల్లాలో జీపీవో పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు 

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న గ్రామపాలనాధికారి (జీపీవో) పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. శనివారం సీసీఎల్​ఏ నవీన్​ మిట్టల్​తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో కలెక్టర్​ జిల్లా డేటా వివరించారు. గవర్నమెంట్​గిరిరాజ్​ డిగ్రీ కాలేజీలో సెంటర్​ ఏర్పాటు చేశామని,  331  మంది హాజరుకానుండగా ప్రతి రూమ్​లో 32 మంది అభ్యర్థులు పరీక్ష రాసేలా ఏర్పాటు చేశామన్నారు.

ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.3గంటల వరకు పరీక్ష ఉంటుందని, సకాలంలో ఆర్టీసీ బస్సులు నడుపుతామన్నారు. అడిషనల్​ కలెక్టర్ కిరణ్​కుమార్, అడిషనల్​డీసీపీ బస్వారెడ్డి, ఆర్డీవో రాజేంద్రకుమార్, కాలేజీ ప్రిన్సిపాల్​ మోహన్, ఏవో ప్రశాంత్, తహసీల్దార్ బాలరాజు పాల్గొన్నారు. 

జూన్​లో మూడు నెలల బియ్యం పంపిణీ 

జిల్లాలోని రేషన్ కార్డులపై జూన్​లో ఒకేసారి మూడు నెలల రైస్​ పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు తెలిపారు. వర్షాలు, వరదలు, బియ్యం స్టాక్ పెట్టే సమస్యను గమనంలోకి తీసుకొని గవర్నమెంట్​ ఆదేశాల మేరకు, జూన్​, జులై, ఆగస్టు నెల కోటా ఒకేసారి అందిస్తామన్నారు.