మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి : రాజీవ్​గాంధీ

మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి : రాజీవ్​గాంధీ
  • కలెక్టర్​ రాజీవ్​గాంధీ

నిజామాబాద్​, వెలుగు : జిల్లా స్వయం సహాయ సంఘాల్లో సభ్యత్వం ఉన్న 3.40 లక్షల మందిలో నిరక్షరాస్యుల వివరాలు సేకరించి, వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పని చేయాలని కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు కోరారు. సోమవారం కలెక్టరేట్​లో 'అక్షరలక్ష్మి' యాప్​ను కలెక్టర్​ ఆవిష్కరించి మాట్లాడారు. 

యాప్​లో నమోదు చేసిన నిరక్షరాస్య మహిళలకు అక్షరాస్యత సెంటర్​ వలంటీర్లతో చదువు నేర్పుతామన్నారు.  మధ్యలో చదువు మానేసిన వారిని ఓపెన్​ టెన్త్​, ఓపెన్​ ఇంటర్ పరీక్షలు రాయిస్తామన్నారు.  జిల్లాలో 55 శాతం ఉన్న మహిళా అక్షరాస్యత వంద శాతం చేరేలా కృషి చేయాలన్నారు. డీఆర్డీవో సాయాగౌడ్​, ఏపీడీ రవీందర్, డీఈవో అశోక్​, డీడబ్ల్యూవో రసూల్​బీ, డీఎంఅండ్​హెచ్​వో డాక్టర్ రాజశ్రీ తదితరులు ఉన్నారు.

300 మందికి 50 రోజుల ల్యాండ్​ సర్వే ట్రైనింగ్..​

భూభారతి చట్టంలో భాగంగా జిల్లాలో సెలెక్ట్​ చేసిన 300 మంది లైసెన్స్​డ్​ సర్వేయర్లకు 50 రోజుల పాటు నిపుణుల వద్ద శిక్షణ ఇప్పిస్తామని కలెక్టర్ రాజీవ్​గాంధీ తెలిపారు. సోమవారం ఆయన ట్రైనింగ్ క్యాంప్​ ప్రారంభించి ప్రసంగించారు. సర్వే మ్యాప్​, ఆధార్ మాదిరిగా రైతులకు భూధార్ నంబర్ల కేటాయింపులో సర్వేయర్ల పాత్ర కీలకమన్నారు.  శిక్షణలో అన్ని విషయాలు నేర్చుకోవాలని జూలై 28, 29 తేదీల్లో నిర్వహించే ఎగ్జామ్​లో మెరిట్ పొందిన వారికి ప్రభుత్వ లైసెన్స్​ఇచ్చి సర్వేయర్లుగా అపాయింట్ చేస్తామన్నారు.  అదనపు కలెక్టర్​ కిరణ్​కుమార్​, సర్వే ల్యాండ్​ రికార్డ్స్​ ఏడీ అశోక్​ ఇన్​స్పెక్టర్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.