జనగామ అర్బన్, వెలుగు: వలసలను నిరోధించడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామీణ శ్రేయస్సు స్థితిస్థాపకత కార్యక్రమానికి జనగామ జిల్లా ఎంపికైందని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్ లో ప్రకటించిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎంపికైన నేపథ్యంలో కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో మంగళవారం రూరల్ డెవలప్మెంట్జాయింట్సెక్రటరీకి కలెక్టర్ పవర్ పాయింట్ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్థితిగతులను వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ శ్రామిక శక్తికి కొత్త నైపుణ్యాలను అందించడం, ఆయా ప్రాంతాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడం, వ్యవసాయం, ఇతర గ్రామీణ సంస్థలను మెరుగుపరచడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరించడం తదితర అంశాలకు సంబంధించిన కార్యక్రమాలను చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ మహిళలు, రైతులు, యువత, భూమిలేని కుటుంబాలు లబ్ధిపొందనున్నట్లు తెలిపారు.
