సంగారెడ్డి టౌన్, వెలుగు: జీవో 58 ,59 కింద దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఈనెల 30 వరకు గడువు పొడగించిందని కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్లు, రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లతో ల్యాండ్ పూలింగ్, జీవో 58,59 దరఖాస్తుల స్వీకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యంతరం లేని ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు కటాఫ్ తేదీని 2014 జూన్ 2 నుంచి 2020 జూన్ 2 వరకు పొడిగించిందని తెలిపారు. అర్హులు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకునేలా ప్రచారం చేయాలని సూచించారు. గతంలో తిరస్కరించినా కూడా మళ్లీ అప్లై చేసుకోవచ్చన్నారు. 2020 జూన్ 2వ తేదీ లోపు సంబంధిత స్థలం వారి ఆధీనంలో ఉన్నట్లు ఆధారాలు చూపాల్సి ఉంటుందన్నారు. జీవో 59 కింద పెండింగ్ ఉన్న రుసుము చెల్లింపులపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ప్రతి మున్సిపాలిటీలో ల్యాండ్ పూలింగ్ కింద 25 ఎకరాలు గుర్తించి, ఈనెల 17 లోగా స్వాధీనం చేయాలని మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లను ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీలో ల్యాండ్ పూలింగ్ కింద సేకరించిన భూమిలో లేఅవుట్ చేసి, లబ్ధిదారులకు ఎకరాకు 600 గజాల చొప్పున స్థలాన్ని ఇస్తారని కలెక్టర్ తెలిపారు. అసైన్డ్ ల్యాండ్ అయితే భూయజమాని సమ్మతితో మాత్రమే భూ సేకరణ చేయాలని కలెక్టర్ సూచించారు. మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు నగేశ్, రమేశ్ బాబు, అంబాదాస్, తహసీల్దార్లు పాల్గొన్నారు.
జీవో 58, 59 గడువు పొడిగింపు
- మెదక్
- April 15, 2023
లేటెస్ట్
- వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- అధికారంలోకి వస్తే దేశమంతా తెలంగాణ హామీలు అమలు : రాహుల్ గాంధీ
- ఆడబిడ్డకు ఎంపీగా ఛాన్స్ ఇవ్వండి: సీఎం రేవంత్ రెడ్డి
- తక్కువ ధర.. అధిక మైలేజ్.. సాటి లేని టీవీఎస్ బైకులు
- Trisha: గంటల తరబడి గోడను చూస్తాడు.. విజయ్లో నచ్చని విషయం అదే అంటున్న త్రిష
- కవిత జైలుకు వెళ్లడంతో బీఆర్ఎస్ బలహీనపడింది : కడియం శ్రీహరి
- యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి మూడు గంటలు
- జేపీ నడ్డాపై కాంగ్రెస్ ఫిర్యాదు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- Shahid Kapoor: ప్రేమ పేరుతో ఇద్దరు హీరోయిన్స్ మోసం చేశారు.. షాహిద్ షాకింగ్ కామెంట్స్
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్