రూల్స్‌‌‌‌‌‌‌‌ ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలి : కలెక్టర్​ సత్యప్రసాద్​

రూల్స్‌‌‌‌‌‌‌‌ ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలి : కలెక్టర్​ సత్యప్రసాద్​

కోరుట్ల, వెలుగు: ప్రభుత్వ నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని జగిత్యాల కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సత్యప్రసాద్‌‌‌‌‌‌‌‌ లబ్ధిదారులకు సూచించారు. శనివారం కోరుట్ల మండలం మోహన్​రావుపేట గ్రామంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపిక సమయంలో ఫొటో దిగిన స్థలంలోనే లబ్ధిదారులు ఇండ్లు కట్టుకోవాలని, వేరే స్థలంలో నిర్మిస్తే బిల్లులు రావన్నారు. నిబంధనల ప్రకారం 400 నుంచి 600 స్క్వైర్​ ఫీట్లలోనే విస్తీర్ణంలోనే నిర్మించుకోవాలన్నారు. ఆయన వెంట ఆర్డీవో జివాకర్​రెడ్డి, హౌసింగ్ పీడీ ప్రసాద్, తహసీల్దార్​ కృష్ణ చైతన్య, ఎంపీడీవో రామకృష్ణ , ఎంపీవో కృపాకర్, ఆర్ఐ రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, తదితరులు పాల్గొన్నారు.

భూ సమస్యలు పరిష్కరించాలి  

జగిత్యాల టౌన్, వెలుగు: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో అన్ని రకాల సమస్యలని పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో భూ భారతిపై రెవెన్యూ అధికారులతో రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని మండలాల్లో ఊరూరా జరిగే సమావేశానికి ముందే రెండు రోజులు గ్రామాల్లో ప్రచారం చేసి, దరఖాస్తు ఫారంలను అందుబాటులో ఉంచాలని చెప్పారు. తహసీల్దార్ , నాయబ్ తహసీల్దారు రెండు టీంలుగా ఏర్పడి ఎప్పటికపుడు భూసమస్యలపై విచారణ చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లత, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.