
కోరుట్ల, వెలుగు: రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై వచ్చిన ప్రతి దరఖాస్తు పరిష్కారానికి కృషి చేయాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్అధికారులను ఆదేశించారు. సోమవారం కథలాపూర్ మండలం తాండ్రియాల, గంభీర్ పూర్ గ్రామాల్లో జరుగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సులను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను త్వరగా ఫీల్డ్ విచారణ పూర్తి చేయాలన్నారు. విచారణ పూర్తయిన వెంటనే ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు. కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహసీల్దార్ వినోద్ , సిబ్బంది ఉన్నారు..