భూ సమస్యలపై వచ్చిన ప్రతి దరఖాస్తు పరిష్కరించాలి : కలెక్టర్ సత్య ప్రసాద్

భూ సమస్యలపై వచ్చిన ప్రతి దరఖాస్తు పరిష్కరించాలి : కలెక్టర్ సత్య ప్రసాద్

కోరుట్ల, వెలుగు:  రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై వచ్చిన ప్రతి దరఖాస్తు పరిష్కారానికి కృషి చేయాలని జగిత్యాల కలెక్టర్​ సత్యప్రసాద్​అధికారులను ఆదేశించారు. సోమవారం కథలాపూర్ మండలం తాండ్రియాల, గంభీర్ పూర్ గ్రామాల్లో జరుగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సులను కలెక్టర్ పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను త్వరగా ఫీల్డ్ విచారణ పూర్తి చేయాలన్నారు. విచారణ పూర్తయిన వెంటనే ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు. కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహసీల్దార్ వినోద్ , సిబ్బంది ఉన్నారు..