ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్లోని జిన్నింగ్ మిల్లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ స్నేహ శబరీశ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని సూచించారు.
కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మార్కెట్అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సుకినె సంతాజీ, కాంగ్రెస్మండలాధ్యక్షుడు ఎలిగేడి ఇంద్రసేనారెడ్డి, యూత్ అధ్యక్షుడు అంబాల శ్రీకాంత్, అధికారులు రైతులు పాల్గొన్నారు.
