![రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలి : తేజస్ నందలాల్ పవార్](https://static.v6velugu.com/uploads/2024/05/collector-tejas-nandalal-pawar-directed-officials-to-make-arrangements-for-state-birth-decade_5MEmPckqrJ.jpg)
వనపర్తి టౌన్, వెలుగు: జూన్ 2న రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. అవతరణ దినోత్సవ దశాబ్ది వేడుకలను ఐడీఓసీ నిర్వహించాలన్నారు.
జూన్ 2న ఉదయం 9 గంటలకు జాతీయ జెండావిష్కరణ అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం ఉదయం 9.30 గంటలలోపే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ఎం నగేశ్ తదితరులు పాల్గొన్నారు.