పునరావాస పనులు కంప్లీట్ చేయండి : కలెక్టర్ విజయేందిర బోయి

పునరావాస పనులు కంప్లీట్ చేయండి : కలెక్టర్ విజయేందిర బోయి
  • ఉదండపూర్ రిజర్వాయర్  నిర్వాసితులకు మౌలిక వసతులు కల్పించండి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఉదండపూర్ రిజర్వాయర్ నిర్వాసిత కుటుంబాలకు అర్ ఆండ్ అర్ కింద కేటాయించే స్థలాల్లో అన్ని మౌలిక వసతులు వేగంగా కంప్లీట్ చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌‌‌‌లో  రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్, సంబంధిత అధికారులతో  ఉదండాపూర్ రిజర్వాయర్ పునరావాస పనులపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉదండాపూర్ రిజర్వాయర్ కింద వల్లూరు, ఉదండపూర్, తుమ్మల కుంట తండా, రేగడి పట్టి తండా, చిన్నగుట్ట తండా, శామ గడ్డ తండా, ఒంటి గుడిసె తండా, పోలేపల్లి వ్యవసాయ క్షేత్రంలో ఇండ్లు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు, అవార్డు అందుకున్న వారందరికి పునరావాసం కింద అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలన్నారు.

  ప్రైమరీ హెల్త్ సెంటర్, ఇంటిగ్రేటెడ్ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు, వెటర్నరీ హాస్పిటల్, కమ్యూనిటీ హాల్స్, గ్రామ పంచాయతీ భవనం, పార్కులను, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, ఓవర్ హెడ్ ట్యాంక్, మిషన్ భగీరథ పైపులు వంటి  సదుపాయాలు కంప్లీట్ చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మోహన్ రావు, ఆర్డీవో నవీన్, ఇరిగేషన్, మిషన్ భగీరథ, సర్వే లాండ్ రికార్డు, పంచాయతీరాజ్ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.