ఫీల్డ్ విజిట్ కు గ్రూప్–1 ట్రైనీ ఆఫీసర్లు : కలెక్టర్ విజయేందిర బోయి

ఫీల్డ్ విజిట్ కు గ్రూప్–1 ట్రైనీ ఆఫీసర్లు : కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: శిక్ష సమయంలో కొత్త విషయాలు నేర్చుకోవాలని, ఉద్యోగంలో పేదల సంక్షేమానికి కృషి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు.  హైదరాబాద్ లో శిక్షణ పొందుతున్న 60 మంది గ్రూప్–1 ట్రైనీ ఆఫీసర్లు రెండు రోజుల ఫీల్డ్​విజిట్​లో భాగంగా మంగళవారం మహబూబ్ నగర్ చేరుకున్నారు. కలెక్టర్​ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ట్రైనీ ఆఫీసర్లు గండీడ్, నవాబ్ పేట్, చిన్న చింతకుంట, అడ్డాకల్, కౌకుంట్ల మండలాల్లోని కొన్ని గ్రామాలను సందర్శించి, అక్కడి ప్రజల జీవన స్థితిగతులను తెలుసుకుంటారని ఆమె చెప్పారు.