
- కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
నిజామాబాద్, వెలుగు : నగర పాలక సంస్థ పరిధిలో అన్ని రకాల పన్నులు వసూలు చేయాలని, ఎవరిపై మెహర్బానీ చూపించొద్దని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. శుక్రవారం నగర పాలక స్పెషల్ ఆఫీసర్ హోదాలో కలెక్టరేట్లో రివ్యూ నిర్వహించి మాట్లాడారు. ట్యాక్స్లు పెండింగ్ పెట్టిన వారిని గుర్తించి నోటీసులు జారీ చేయాలని, స్పందించకుంటే ఆస్తులు జప్తు చేయాలన్నారు. అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించి క్రమబద్ధీకరించాలని నగర పాలక కమిషనర్ దిలీప్కుమార్ను ఆదేశించారు.
పర్మిషన్లేని నిర్మాణాలను ఆపాలని, శానిటేషన్, వాటర్ సప్లై లోపాలుంటే సరిచేసుకోవాలని, ఎలాంటి ఫిర్యాదు రావద్దన్నారు. వంద రోజుల ప్లాన్తో పని చేసి ఫలితాలు చూపాలని సూచించారు. ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టిన ఇంటి ప్లాట్ ఓనర్కు ప్రొసీడింగ్స్ అందించాలన్నారు. డిప్యూటీ కమిషనర్ రవిబాబు తదితరులు ఉన్నారు. అంతకు ముందు కలెక్టర్ రైతు బజార్, బస్తీ దవాఖాన, అమృత్ స్కీమ్లను
పరిశీలించారు. ఈవీఎం గోదామ్ చెక్ చేశారు.