అమృత్ స్కీమ్ ట్యాంకు పనుల వేగం పెంచాలి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

అమృత్ స్కీమ్ ట్యాంకు పనుల వేగం పెంచాలి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

నిజామాబాద్​, వెలుగు: అమృత్​ 2.0 స్కీమ్​ కింద నగరానికి మంజూరైన వాటర్ ట్యాంకు పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్​ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన నగర పాలక పరిధిలోని ఖానాపూర్​, కాలూర్​ విలీన గ్రామాలను కమిషనర్​ దిలీప్​కుమార్​తో కలిసి పరిశీలించారు. ట్యాంకుల పక్కనే ఉన్న సర్కార్​ స్కూల్​ను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దుబ్బ ఏరియాలో అండర్​ గ్రౌండ్​ పైప్​లైన్​ పనులు ఆలస్యం కావడంపై కాంట్రాక్టర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 గంజ్​ ప్రాంతంలో ఆక్రమణలు తొలగించాలని, నాగారం గృహకల్ప ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అలాట్​ చేయాలని ఆర్​అండ్​బీ ఇంజినీర్లను ఆదేశించారు. తడిపొడి చెత్తను వేరుగా సేకరించాలన్నారు. ఖానాపూర్​ పీహెచ్​సీ, మోపాల్​లోని సింగిల్​ విండో గోదామ్​ సందర్శించి యూరియా స్టాక్​ వివరాలను తెలుసుకున్నారు.